- Advertisement -
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచుల టి-20ల సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో గెలుచుకుంది. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా (ఈ రోజు)ఆదివారం జరుగనున్న మూడో టి20 ఇందుకు వేదిక కానుంది. ఇప్పటికే సిరీస్ వశమైనందున టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. భారత్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నయి.బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతినిచ్చారు.
వీరి స్థానాల్లో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్, స్థానిక కుర్రాడు వాషింగ్టన్ సుందర్ ఆడనున్నారు. కెప్టెన్ రోహిత్ గత మ్యాచ్లోలానే చెలరేగితే విండీస్ జట్టుకు మరో ఓటమి తప్పదు.కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్లతో బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉంది. మరి నామమాత్రపు మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి.