టీమిండియా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన వన్డే సిరీస్ పై గురిపెట్టింది. అయితే మొదటి వన్డే వర్షంతో రద్దయ్యింది. కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఉన్నాయని కొద్దిరోజులుగా ప్రచారం సాగింది. తాజాగా మరో సారి వాటన్నింటికి పుల్ స్టాప్ పెట్టారు.
మాత్రం చాలా సరదాగా గడిపారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ ఫన్ చేస్తూ ఆటపట్టిస్తుంటారు. తాజాగా రోహిత్ శర్మ, జడేజాల మధ్య సాగిన ఫన్ గేమ్ నెటిజన్స్కి కూడా నవ్వు పుట్టిస్తుంది.
మ్యాచ్ రద్దవడంతో రవీంద్ర జడేజా-రోహిత్లు మూగ సైగల ద్వారా ఒక పోటీ పెట్టుకున్నారు. ఇందులో ఒక ఆటగాడ్ని ఒకరు అనుకరిస్తే మరొకరు వారి పేరు చెప్పాలి. ఇందులో ఒక ఆటగాడ్ని ఒకరు అనుకరిస్తే మరొకరు వారి పేరు చెప్పాలి. ముందుగా బుమ్రా యాక్షన్ని జడేజా అనుకరించాడు.
తర్వాత కోహ్లి శైలిని అనుకరించమని రోహిత్ ఫ్లకార్డు చూపించడంతో జడేజా అచ్చం అలానే చేసి చూపించాడు. కోహ్లి బంతిని ఎదుర్కొనే క్రమంలో ఏమి చేస్తాడు.. బంతిని ఎలా విడిచిపెడతాడు అనే దానిని జడేజా మూగ సైగల ద్వారా అనుకరించాడు. దాంతో అక్కడ మరోసారి నవ్వుల వాతావరణం ఏర్పడింది. దీన్ని కూర్చిలో కూర్చుని దూరంగా ఉండి గమనిస్తున్న కోహ్లి సైతం నవ్వుకుంటూ….రోహిత్, జడేజా మీరు ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.