ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో భారత క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు సోషల్ మీడియాలో కనిపిస్తే చాలు అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడ్డారు. ఫ్యాషన్పై కాకుండా మ్యాచ్పై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
తాజాగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన ఇన్స్టాగ్రాంలో ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.బ్లాక్ కలర్ డ్రెస్తో ఉన్న పాండ్య ఎంతో స్టైల్గా కనిపించాడు. ఈ ఫొటోను చూసిన అభిమానులు పాండ్య ఫ్యాషన్పై కాదు మ్యాచ్పై దృష్టి పెట్టు, ఇంగ్లాండ్లో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నావుగా; లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత ఎన్ని ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నావో చెప్పు’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
బీసీసీఐ డబ్బుతో నీ జీవితంలో మొదటి, చివరి యూకే టూర్ ను బాగా ఎంజాయ్ చేయ్’ అని ఓ నెటిజన్ విమర్శించగా, సోకులపై కాదు ఆటపై దృష్టి పెట్టాలని మరొకరు సూచించారు. మరికొందరైతే.. అక్కడ క్రికెట్ ఆడటానికి వెళ్లావా? లేదా ఎంజాయ్ చేయడానికి వెళ్లావా? అని మరికొందరు హార్దిక్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజు ట్రెండ్ బ్రిడ్జ్ లో ఇంగ్లండ్ తో భారత్ మూడో టెస్ట్ ఆడనుంది.
ఈ టెస్టులో భారత్ గెలిస్తేనే పోటీలో నిలుస్తుంది. లేదంటే ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ వశమవుతుంది. ఎడ్జ్బాస్టన్, లార్డ్స్ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లో భారత్ ఓటమి మూట కట్టుకున్న సంగతి తెలిసిందే.