ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై సన్రైజర్స్ అద్భుత విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ సన్రైర్స్ బౌలర్లముందు చేతు లెత్తేసింది. పంజాబ్ ఓటమికి స్వీయ తప్పిదాలే కారనంగా చెప్పవచ్చు. ఓటమిపై కెప్టెన్ అశ్విన్ స్పందించారు.
చెత్త ఫీల్డింగ్ కొంపముంచిందని కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వాపోయాడు. మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఆటగాల్లపై అసహనం వ్యక్తం చేశారు. తమ బ్యాట్స్మన్లు అనవసర రిస్క్ షాట్లకు ప్రయత్నించి ఓటమిని కొనితెచ్చుకున్నారని మండిపడ్డాడు. బౌలర్ల కారణంగానే సన్రైజర్స్ గెలిచిందన్నాడు.
చెత్త బ్యాటింగ్, సన్రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా మేము ఓడిపోయాం. మిడిల్ ఆర్డర్లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అతీగా ఎదురుదాడికి పోయి కొన్ని వికెట్లు చేజార్చుకున్నాం. మా జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నప్పటికీ ఈరోజు రాణించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
]ఈ మ్యాచ్లో మా ఫీల్డింగ్ అస్సలు బాలేదు 20 ఓవర్లలో మ్యాచ్లో ఎక్కువ క్యాచ్లు వదలేయడంతో చివరికి మూల్యం చెల్లించుకున్నాం. ఈ క్యాచ్లు పట్టివుంటే 20 నుంచి 30 పరుగులు తక్కువగా ఇచ్చేవాళ్లం. తర్వాత మ్యాచ్లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడతామ’ని అశ్విన్ చెప్పాడు.