ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. రెండు జట్లు మ్యాచ్లో తప్పక గెలవాల్సిందే. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్, ముంబై తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
నేటి మ్యాచ్కు సంబంధించి పంజాబ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. యువరాజ్ సింగ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ స్థానంలో యువీ, మనోజ్ తివారీని తీసుకున్నారు.
తుదిజట్లు
కింగ్స్ పంజాబ్ : రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), కేఎల్ రాహుల్, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, యువరాజ్ సింగ్, మనోజ్ తివారీ, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, అంకిత్ రాజ్పుత్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్, ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, బెన్ కట్టింగ్, మిచెల్ మెక్గ్లాన్, మయాంక్ మార్కండే, జస్ప్రిత్ బుమ్రా