ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు.
టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన చెన్నై జట్టు ఏడు మ్యాచ్ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో ఉంది. సీజన్లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తప్పక గెలవాల్సి ఉంది.
ఇప్పటివరకూ చెన్నై పది మ్యాచ్లు ఆడగా ఏడింట గెలుపొంది రెండో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్లో చెన్నై గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. మరొకవైపు రాజస్తాన్ది క్లిష్ట పరిస్థితి. పది మ్యాచ్లకు గాను నాలుగింట మాత్రమే రాజస్తాన్ విజయం సాధించింది. దాంతో ఇక నుంచి ఆడే ప్రతీ మ్యాచ్ రాజస్తాన్కు కీలకమే. ప్లే ఆఫ్ బెర్తుపై సజీవంగా ఆశలు నిలుపుకోవాలంటే చెన్నైపై గెలుపును సాధించాల్సి ఉంది.