Thursday, May 16, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌పై టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న కోహ్ల‌సేన‌

- Advertisement -

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌ టాస్ పడింది. టాస్‌ గెలిచిన బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. ఐపీఎల్‌లో ఇది 39వ మ్యాచ్. జట్టులో రెండు మార్పులు జరిగాయని.. మురుగన్ అశ్విన్ స్థానంలో మనన్ వోహ్రా, మెక్‌కల్లమ్ స్థానంలో మొయిన్ అలీ జట్టులోకి వచ్చారని కోహ్లి తెలిపాడు. కాగా, హైదరాబాద్ జట్టులో ఎలాంటి మార్పులేదని కెప్టెన్ విలియమ్సన్ వెల్లడించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అలెక్స్ హేల్స్, శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, షకీబుల్ హసన్, యూసఫ్ పటాన్, వృద్ధిమాన్ సాహా (కీపర్), భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: పార్థివ్ పటేల్ (కీపర్), మనన్ వోహ్రా, విరాట్ కోహ్లి(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్, మొయిన్ అలీ, కొలిన్ డిగ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -