వరుస ఓటమిలతో సతవముతున్న సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారనంగా భూవీకి విశ్రాంతి నిచ్చింది జట్టు మేనేజ్ మెంట్. భువనేశ్వర్ జట్టుతోపాటు ముంబై రాలేదని కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు.
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో గాయపడి.. చెన్నైతో జరిగిన మ్యాచ్లో బరిలో దిగని ఓపెనర్ శిఖర్ ధావన్ ముంబైపై ఆడతాడనే ఆశాభావాన్ని విలియమ్సన్ వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు సాధించి జోరు మీద కనిపించిన సన్రైజర్స్.. వరుసగా రెండు మ్యాచ్ల్లో పోరాడి ఓడింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక ముంబయ్ ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు కూడా పేవలమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్ సన్రైజర్స్పై గెలిచి సచిన్కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తోంది.