ఐపీఎల్లో అంపైర్ల నిర్ణయాలపై కెప్టెన్ల రుసరుసలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న ధోని.. నిన్న కోహ్లీ.. తాజాగా రోహిత్శర్మ ఇలా అంపైర్ల తప్పుడు నర్ణయాలకు వికెట్ కోల్పోతున్నారు. అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లు తమ అసహనాన్ని మైదానంలోనే వ్యక్తపరుస్తున్నారు. తాజాగా కేకేతో జరిగిన మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై జరిమానా పడింది.
కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన రోహిత్ శర్మ.. పెవిలియన్కి వెళ్తూ నాన్స్ట్రైక్ ఎండ్లోని బెయిల్స్ను బ్యాట్తో పడగొట్టాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన రోహిత్పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. కోల్కతా నైట్రైడర్స్తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన రోహిత్ శర్మ.. పెవిలియన్కి వెళ్తూ నాన్స్ట్రైక్ ఎండ్లోని బెయిల్స్ను బ్యాట్తో పడగొట్టాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన రోహిత్పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు. రోహిత్ ఆ నిర్ణయాన్ని సమీక్ష కోరాడు.
సమీక్షలో బంతి పిచింగ్ ఔట్ సైడ్లో పడటంతో పాటు లెగ్ వికెట్ను కొంచెం తాకుతూ వెళ్లినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్.. ‘అంపైర్స్ కాల్’కు అవకాశం ఇచ్చాడు. మైదానంలో అంపైర్గా ఉన్న నితిన్ మీనన్ ముంబయి ఔట్గా ప్రకటించడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు.బౌలింగ్ ఎండ్లో ఉన్న అంపైర్ దగ్గరికి వచ్చి ఏవో వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా అక్కడున్న వికెట్లను తన బ్యాటుతో కొట్టాడు. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద రోహిత్శర్మకు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది.