- Advertisement -
ఐపీఎల్ ఫైనల్ పోరు కొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో వాంఖడే వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2018 సీజన్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే చెన్నై చేతిలో మూడుసార్లు ఓడిన హైదరాబాద్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని ఆశపడుతుండగా.. ఫైనల్లోనూ అదే జోరుని కొనసాగించాలని ధోనీసేన ఉవ్విళ్లూరుతోంది.
ముఖ్యంగా సన్రైజర్స్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ తన గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. బంతుల వ్యవధిలో మ్యాచ్ గమనాన్ని మార్చేస్తున్నాడు. దీంతో.. ఈరోజు ఫైట్ మొత్తం చెన్నై బ్యాట్స్మెన్ vs రషీద్ ఖాన్లా జరిగే అవకాశం ఉంది. చెన్నై ఇప్పటికే రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ను గెలవగా.. హైదరాబాద్ జట్టు 2016లో టైటిల్ విజేతగా నిలిచింది.