ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్-11లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. క్వాలిఫయర్-2లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయంపాలైన సన్రైజర్స్.. వరుసగా నాలుగు విజయాలు సాధించిన నైట్రైడర్స్ తుదిపోరు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి. టాస్ గెలిచి కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
కాగా, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు కెప్టెన్ విలియమ్సన్ చెప్పాడు. మనీష్ పాండే, శ్రీవాత్స్ గోస్వామి, సందీప్ శర్మ స్థానాల్లో హుడా, సాహా, ఖలీల్ను తీసుకున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. మరోవైపు కోల్కతా జట్టులో ఒక్క మార్పు మాత్రమే జరిగింది. జావన్ సీర్లెస్ను పక్కనపెట్టి శివమ్ మావిని తీసుకున్నట్లు దినేష్ కార్తీక్ వెల్లడించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, దీపక్ హుడా, వృద్ధిమాన్ సాహా (కీపర్), కార్లోస్ బ్రాత్వైట్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, క్రిస్ లిన్, రాబిన్ ఉతప్ప, నితీష్ రానా, దినేష్ కార్తీ్క్ (కెప్టెన్/కీపర్), శుభ్మన్ గిల్, ఆండ్రీ రసెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, శివమ్ మావి