ఐపీఎల్ 2024 సమరం నేటి నుండి ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్లో ఆర్సీబీతో తలపడనుంది చెన్నై. అయితే ఐపీఎల్లో చెన్నైకి వరెస్ట్ రికార్డు ఉంది. ఐపీఎల్లో తొలి మ్యాచ్లో చెన్నై గెలిచిన సందర్భం లేదు.
ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలో తొలి మ్యాచ్లో ఓడిపోయింది. అయితే తర్వాత మాత్రం అదిరే పర్ఫామెన్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.ఇప్పటివరకు ధోని సారధ్యంలో 5 సార్లు కప్పు గెలిచింది చెన్నై. తాజా సీజన్లో సీఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
ధోని – కోహ్లీ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ కావడంతో ఆ ఇద్దరి మధ్య పోరు చూసేందుకు అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొదటిసారి ఐపీఎల్ లో ప్లేయర్ లా ఆడబోతుండగా తొలి సారి కెప్టెన్ ను మార్చిన చెన్నైకి ఈ సీజన్ ఒక పరీక్ష లాంటిదే. చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, ధోని, జడేజా, శివం దూబే లాంటి స్టార్ ప్లేయర్లు ఉండగా ఆర్సీబీకి డూప్లిసిస్, విరాట్ కోహ్లీ, మాక్స్ వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మరి ఈ తొలి మ్యాచ్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి.