బాలీవుడ్ హీరోయిన్ కైరా అడ్వాణి మరో సారి మహేంద్రసింగ్ ధోనీ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. అంతేకాకుండా మహేంద్రసింగ్ ధోనీతో కలిసి బైక్ రైడింగ్ కు వెళ్లాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టుంది. ‘ఎమ్.ఎస్.ధోనీ-ద అన్టోల్డ్ స్టోరీ’ మూవీలో కైరా.. సాక్షి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
రీసెంట్ గా కైరా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా రిపోర్టర్ ‘మీకు ఎవరితో కలిసి బైక్ రైడింగ్కు వెళ్లాలని ఉంది.’ అని అడగ్గా ఆమె ఏమాత్రం తడుముకోకుండా భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పింది. ‘ధోనీకి బైకులంటే ఎంతిష్టమో అందరికీ తెలుసు. రాంచీలో ధోనీ తన ఇంట్లో బైక్ల కోసం ప్రత్యేక గ్యారేజీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు’ అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం మహేష్ బాబు భరత్ అనే నేను మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా విజయ్ తో కూడా ఓ మూవీ చేయనుంది కైరా.