రాహుల్, హార్ధిక్ పాండ్యాలను తాజాగా బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. హిందీ పాపులర్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో మహిళలను కించ పరిచే విధంగా హార్ధిక్ పాండ్యా మాట్లాడిన సంగతి తెలిసిందే. హార్ధిక్ పాండ్యాపా సోషియల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తాయి. కాఫి విత్ కరణ్’లో మహిళల పట్ల అగౌరవంగా కామెంట్ చేశానని షోలో నేను మాట్లాడిన మాటలు ఎవరినైనా కించపరిచేవిగా ఉంటే క్షమించండంటూ కోరారు.
కొన్ని వారాల క్రితం కాఫీ విత్ కరణ్లో పాండ్యా.. ‘మా అమ్మానాన్నలతో ప్రతి విషయం షేర్ చేసుకుంటాను. సెక్స్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పేస్తా. అమ్మాయిలతో గడిపిన క్షణాలను సైతం వారి దగ్గర దాచను. నా వర్జినిటీ కోల్పోయిన సందర్భం కూడా వారికి చెప్పా’ అని చెప్పుకొచ్చాడు పాండ్యా.ఈ టీవీ కార్యక్రమంలో హార్దిక్తో పాటు కేఎల్ రా్హుల్ కూడా పాల్గొన్నాడు.
ఇప్పటికే పాండ్య సారీ చెప్పినప్పటికీ.. అది సరిపోదని భావిస్తోన్న బోర్డు.. కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. పాండ్యతోపాటు రాహుల్కు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఇండియన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది.