ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ ఆధ్యంతం ఆసక్తిగా సాగుతోంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా రెండో టెస్టులో టీమిండియా గెలిచి సిరీస్ను సమం చేసింది. అయితే ఈ సిరీస్లో సీనియర్లు లేకపోవడం కొట్టొచ్చినట్లు కనబడింది.
ముఖ్యంగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడింది. తొలి రెండు టెస్టులకు కోహ్లీ అందుబాటులో ఉండరని ప్రకటించినా ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ సిరీస్కు అందుబాటులో ఉండటం కష్టమే.
ఈ నెల 15 నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. కోహ్లీ ఆర్య అనుష్క ప్రగ్నెంట్ కావడంతో ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశంతో సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్ కు దూరమైన కేఎల్ రాహుల్, జడేజా మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ ఫామ్లో లేకపోవడం అందరిని కలవర పెడుతోంది. మరి మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్మెన్ రాణిస్తే గెలుపు ఖాయం కానుంది.