ఐపీఎల్ 2018 టోర్నమెంట్లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టుతోనే రాయల్ చాలెంజర్స్ ఈ మ్యాచ్ ఆడుతుండగా అటు పంజాబ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ముజీబ్కు బదులుగా మార్కస్ స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు
టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్లాడిన పంజాబ్ జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందిన బెంగళూరు జట్టు ఏడో స్థానంలో ఉంది. సీజన్లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది.
మరోవైపు గత మ్యాచ్లో అనూహ్యంగా కోల్కతా చేతిలో ఓడిన పంజాబ్ జట్టు ప్లేఆఫ్ రేసుకి పోటీపెరిగిన నేపథ్యంలో ఈ మ్యాచ్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. బౌండరీ లైన్ దగ్గరగా ఉండే ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది
జట్ల వివరాలు…
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: లోకేష్ రాహుల్ (వికెట్ కీపర్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, ఆరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), ఆండ్రూ టై, బరిందర్ శ్రాన్, మోహిత్ శర్మ
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: పార్థివ్ పటేల్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, కొలిన్ డి గ్రాండ్హోమ్, టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహల్