- Advertisement -
మూడు వన్డేల సిరీస్లో భాగంగా చెరో మ్యాచ్ గెలిచిని ఇండియా-ఇంగ్లండ్ సిరీస్ తేల్చే చివరి మ్యాచ్కు రెడీ అవుతున్నాయి.టి20లాగే వన్డే సిరీస్ను కూడా గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ చివరి సమరానికి సిద్ధమైంది. వన్డేల్లో కొంత కాలంగా తిరుగులేని ప్రదర్శన కనబరస్తున్న ఇంగ్లండ్ తొలి మ్యాచ్ పరాజయం నుంచి వెంటనే కోలుకొని సత్తా చాటింది.
ఈ సిరీస్నైనా గెలుచుకుంటే సొంతగడ్డపై తమ పరువు నిలబడుతుందని ఆ జట్టు భావిస్తోంది. మిడిలార్డర్ వైఫల్యంతోనే లార్డ్స్ వన్డేను టీమిండియా కోల్పోయింది. ఈ విషయంలో రాహుల్, ధోని, రైనా, పాండ్యా మరింత మెరుగవ్వాల్సి ఉంది.పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలమైన ఈ పిచ్పై భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తుంది.