Sunday, April 28, 2024
- Advertisement -

కోహ్లీ బాటలోనే ధోని..ప్రమోషన్!

- Advertisement -

ఐపీఎల్‌ 2024 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ అనగానే క్రికెట్ లవర్స్‌ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఇక ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ..ఓపెనర్‌గా బరిలోకి దిగుతారు. ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు సీఎస్‌కే కెప్టెన్ ధోని.

కొత్త పాత్ర.. కొత్త సీజన్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ధోని. ఈ సీజన్ లో ధోని కెప్టెన్సీ బాద్యతలకు దూరమై మెంటర్ గా కనిపించబోతున్నారని కొంతమంది చెబుతుండగా మరికొంత మంది మాత్రం ఈ సీజన్ లో ధోని ఓపెనర్ గా బరిలోకి దిగుతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ధోని ఇంతవరకు ఓపెనర్ గా బరిలోకి దిగలేదు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత కూడా ధోని లోయర్ ఆర్డర్ లోనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఇక ఇది చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఓపెనర్‌గా అలరించాలని ధోని ఉవ్విళ్లూరుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ధోని ఫ్యాన్స్‌కు పండగే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -