టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాల కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న కేసులో షమీ భార్య హసీన్ జహాన్ మాజీ భర్త తెరమీదకు వచ్చాడు. హసీన్ జహాన్కు ఇది వరకే పెళ్లి అయ్యిందనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆమె మాజీ భర్తనంటూ షేకీ సైఫుద్దీన్ అనే పశ్చిమ బెంగాల్కు షేకీ సైఫుద్దీన్ అనే వ్యక్తి ఆమె మాజీ భర్తనంటూ మీడియా ముందుకు వచ్చారు. హసీన్ జహాన్ తన మాజీ భార్య అని, ఆమెను 2002లో పెళ్లి చేసుకున్నాని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని బర్భమ్, సియూరిలో కొంత కాలం కాపురం చేసామన్నారు. అయితే తమ వివాహాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, హసీన్ను తొలిసారి 2000 సంవత్సరంలో కలిసానని, అనంతరం వివాహంతో ఇద్దరం ఒక్కటయ్యామన్నారు.
ఇదివరకే ఇద్దరి కూతుల్లకు హసణ్ జన్మనిచ్చిందన్నారు. 2003లో ఒకరిని, 2006లో మరొకరికి జన్మనిచ్చినట్లు సైఫుద్దీన్ తెలిపారు. 2010లో విడాకులు తీసుకున్నామని, ఇద్దరు పిల్లలు హసిన్ దగ్గరే ఉండాలని, ఆమె వివాహనంతరం తండ్రి దగ్గరకు వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. షమీతో ఆమె వివాహనంతరం పిల్లలు తనవద్దకు వచ్చారన్నారు. షమీ, హసీన్ జహన్ల మధ్య వివాదం పరిష్కరమై ఒక్కటవ్వాలని సైఫుద్దీన్ కోరుకున్నారు.
తన తల్లి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, సెలవుల్లో తన తల్లిని కలుస్తామని వారు తెలిపారు. అయితే ఆమెకు ఇదివరకే పెళ్లైందా లేదనే విషయం అధికారికంగా తెలియరాలేదు .ఇక షమీ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని, తనను వేధించాడని హాసిన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హసీన్ స్పందిస్తే గాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.