- Advertisement -
అప్ఘానిస్థాన్ జట్టుతో బెంగళూరులో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్స్ దూకుడు ప్రదర్శించారు.భారత్ ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. శిఖర్ దావన్ వేగంగా ఆడి కేవలం 84 బంతుల్లోనే సెంచరీ సాధించి 107 పరుగుల వద్ద ఔటయ్యాడు.
ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుుతూ మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మురళీ విజయ్ 145 బంతుల్లో సెంచరీ సాధించారు. అప్ఘాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ, చక్కటి క్లాస్ షాట్లతో విజయ్ తన సెంచరీ మార్కుకు చేరుకున్నాడు.