టీ 20 వరల్డ్ కప్కు ముందు ఆప్ఘానిస్తాన్తో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఇవాళ మొహాలీ వేదికగా తొలి టీ20 జరగనుండగా సీనియర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు. ఇక ఆప్ఘాన్ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.
ఆప్ఘాన్ పసికూనే కానీ తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ లో ఆ జట్టు సాధించిన సంచలన విజయాలు నమోదు చేసింది. ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి జట్లను మట్టి కరిపించింది. టీమిండియా ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ వచ్చే అవకాశం ఉండగా మూడో స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. మొహాలీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
దీంతో టాస్ కీలకం కానుండటంతో ఎవరు గెలిస్తే వారు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని భారీ లక్ష్యాన్ని ఉంచే ఛాన్స్ ఉంది. జట్టు అంచనా ; రోహిత్ శర్మ, జైస్వాల్, శుబ్ మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, అక్షర్, అర్షదీప్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ / రవి బిష్ణోయ్, ముఖేష్.