డిఫెండింగ్ ఛాంపియన్గా ఐపీఎల్ 11 సీజన్లో అడుగు పెట్టిన ముంబయ్ ఇండియన్స్ వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. దీంతో రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ప్రధానం ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలుపు దగ్గరగా వచ్చి పరాజయం చెందడాన్ని జీర్ణించుకోవడం చాలా కఠినంగా ఉందన్నాడు. తమ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్.. కనీసం పోరాడే స్కోరును ఉంచలేకపోయామన్నాడు.
వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ మమ్మల్ని గెలుపు ఊరించినట్లే ఊరించి దూరమైంది. ఇది చాలా నిరాశపరిచింది. మేము మంచి స్కోరు సాధించలేకపోయాం. దాంతోనే పోరాడి ఓడిపోయాం. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరొకలా ఉండేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్యాట్స్మెన్ వైఫల్యమే మా కొంప ముంచింది. ఇక బౌలర్లు ఆద్యంత ఆకట్టుకున్నారు. సాధారణ స్కోరును కూడా రక్షించడానికి తీవ్రంగా శ్రమించారు. ఒక దశలో గేమ్ను మా చేతుల్లోకి తీసుకొచ్చారు. కానీ అదృష్టం కలిసిరాలేదు. చివరి వరకూ పోరాడినా ఓటమితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పరాజయం బాధించినా.. యువ క్రికెటర్లు ఆకట్టుకున్న తీరు బాగుంది’అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.