చాలా సంవత్సరాలు తర్వాత భారత్-పాక్ మధ్య వన్డే జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్లో భాగంగా ఈ రోజు చిరకాల ప్రత్యర్థి పాక్తో భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ అంటేనే హైటెన్షన్.
ముఖ్యంగా భారత్, పాక్ అభిమానులు టీవీల ముందు రెడీ అయిపోయారు. నరాల తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్ను మిస్సవ్వకూడదని చాలామంది దుబాయ్ కూడా వెళ్లారు. ఇక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఉత్కంఠగా జరిగే మ్యాచ్ను చూడటానికి దుబాయ్ వెల్లనున్నారు. దీన్ని తిలకించేందుకు ఇమ్రాన్ దుబాయ్ వెళ్లనున్నారని, ఆయన దగ్గరుండి క్రికెటర్లను ఉత్సాహపరుస్తారని పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ మ్యాచ్ కి సంబంధించిన అన్ని టికెట్లూ ఇప్పటికే అమ్ముడైపోయాయి. దుబాయ్ స్వతహాగానే పాకిస్థాన్ కు మద్దతు పలుకుతుంది. అయితే, ఈ మ్యాచ్ ని చూసేందుకు అక్కడున్న అసంఖ్యాకమైన భారతీయులు, వారి సంతతి టికెట్లను కొనుగోలు చేయడంతో స్టేడియంలోని గ్యాలరీలన్నీ కిక్కిరిసిపోవడం ఖాయం