- Advertisement -
యుఏయీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా 1-0తో ఆస్ట్రేలియాపై గెలిచింది.అబుదాబిలో ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో అత్యద్భుతంగా రాణించిన పాకిస్థాన్ 373 పరుగుల భారీ తేడాతో ఆసీస్ని చిత్తుగా ఓడించింది.
తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులు చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్ని 400/9 వద్ద డిక్లేర్ చేసింది. ప్రతిగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 145 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లోనూ 164కే ఆలౌటైంది. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ 10/95 కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసి మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.