- Advertisement -

అబ్రార్ అహ్మద్‌..ఆడేది అనుమానమే?

- Advertisement -

పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ 2026లో జరగనున్న ది హాండ్రెడ్‌ టోర్నీలో ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఇటీవల జరిగిన ‘ది హండ్రెడ్ 2026’ వేలంలో అబ్రార్ అహ్మద్‌ను ఇండియన్ యాజమాన్యంలో ఉన్న సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఈ నిర్ణయం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.

భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత యాజమాన్యంలోని ఫ్రాంచైజీ ఒక పాకిస్థాన్ ఆటగాడిని కొనుగోలు చేయడం పలు వర్గాల్లో విమర్శలకు కారణమైంది. అయినప్పటికీ తాజా నివేదికల ప్రకారం అబ్రార్ అహ్మద్ ఈ టోర్నీలో ఆడే అవకాశాలు అనిశ్చితంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతనికి అవసరమైన ఎన్‌ఓసీ (No Objection Certificate) ఇవ్వకపోవచ్చని సమాచారం. అంతర్జాతీయ మ్యాచ్‌ల కారణంగా ఈ అనుమతి ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్ జట్టు జూలై 15 నుంచి ఆగస్టు 7 వరకు వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అదే సమయంలో ‘ది హండ్రెడ్’ టోర్నీ జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో అబ్రార్ పాల్గొనడం సందిగ్ధంగా మారింది.

అయితే అబ్రార్ అహ్మద్‌కు ఎన్‌ఓసీ లభించే అవకాశాలపై ఇంకా స్పష్టత లేదు. అతని ఏజెంట్ వేలంలో పేరు నమోదు చేయడం వల్ల ఎన్‌ఓసీ వస్తుందని అబ్రార్ విశ్వాసంగా ఉన్నట్లు సమాచారం. పీసీబీ చైర్మన్‌తో అతనికి మంచి సంబంధాలు ఉన్న పాకిస్థాన్ ఆటగాళ్లలో అబ్రార్ ఒకడని కూడా పేర్కొన్నారు.

మొత్తానికి ‘ది హండ్రెడ్ 2026’లో అబ్రార్ అహ్మద్ ఆడే అవకాశాలు ప్రస్తుతం 50–50గా ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -