Thursday, May 9, 2024
- Advertisement -

ష‌మీతో మ్యాచ్‌ఫిక్సింగ్‌, సంబంధ‌పై స్పందించిన పాక్ యువ‌తి

- Advertisement -

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీకి పాకిస్తాన్‌ యువతి అలిషబాతో సంబంధమున్నట్లు ఆమె ద్వారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశాడని అతని భార్య హసీన్‌ జహాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా దక్షిణాఫ్రికా పర్యటనంతరం షమీ నేరుగా భారత్‌కు రాకుండా దుబాయ్‌లో అలిషబాను కలిసాడని జహాన్‌ మీడియాకు తెలిపారు. దీంతో బీసీసీఐ షమీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. అయితే ఈ వివాదంలో కీలకంగా మారిన అలిషబా స్పందిస్తూ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.

ష‌మీతో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీ మోడల్ అలీష్బా ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. తను దుబాయ్లో షమీని కలిసిన మాట నిజమేనని, కానీ అతడితో రాత్రి హోటళ్లో గడపలేదని ఆమె చెప్పారు. క్రి షమీకి లక్షలాది మంది అభిమానులు ఉంటారని, వారిలో నేను ఒకర్ననని ఆమె చెప్పారు. తమ ఆరాధ్య క్రికెటర్ని కలవడానికి ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తారు. అలాగే నేను కూడా షమీని కలవడానికి ఆసక్తి చూపానని ఆమె చెప్పారు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో షమీతో పాకిస్థాన్ అభిమాని ఏదో అన్నాడు. దీంతో షమీ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోవడం కోసం ఫేస్ బుక్ ద్వారా షమీని అడిగాను. దానికి అతడు బదులిచ్చాడు. అప్పటి నుంచి మా మధ్య స్నేహం ఏర్పడిందని అలీష్బా తెలిపింది.

ఇక షమీతో హోటల్‌లో గడిపారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ రోజు తాను నేరుగా తన సోదరి నివాసానికి వెళ్లానని, మరుసటి రోజు షమీ బాయ్‌తో ఆ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రమే చేశానన్నారు. షమీ బాయ్‌ వ్యక్తిగత జీవితం, ఫిక్సింగ్‌ ఒప్పందాల గురించి తనకు తెలియదన్నారు. అబద్దాలు కూడా చెప్పని వ్యక్తి, తన దేశానికి నమ్మక ద్రోహం ఎలా చేస్తాడని ఆమె ప్రశ్నించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -