Sunday, April 28, 2024
- Advertisement -

ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు!

- Advertisement -

దక్షిణాఫ్రికా – భారత్ మధ్య ఇవాళ రెండో టీ20 జరగనుంది. తొలి టీ20 వర్షార్పణం కాగా ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఒక వేళ మ్యాచ్ సజావుగా సాగితే భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో పాటు శ్రేయస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, రవీంద్ర జడేజాతో కూటిన టీమిండియా బలంగా ఉంది.

మరోవైపు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను ఎదుర్కోవడం అంత సులువేమి కాదు. మార్క్మ్‌ జట్టుకు సారథ్యం వహిస్తుండగా హెన్రిక్స్‌, క్లాసెన్‌, మిల్లర్‌, జాన్సెన్‌తో పాటు బౌలింగ్‌లో కోట్జీ, కేశవ్‌ మహరాజ్‌, తబ్రేజ్‌ షంసీని గట్టిగా ఉన్నారు. ఇక ఇవాళ మ్యాచ్ జరిగే పిచ్ వికెట్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌కు సమానంగా సహకరించనుంది.

జట్లు (అంచనా)

భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), యశస్వి, రుతురాజ్‌/గిల్‌, శ్రేయస్‌, రింకూసింగ్‌, జితేశ్‌, జడేజా, కుల్దీప్‌/రవి, ముఖేశ్‌, అర్ష్‌దీప్‌, సిరాజ్‌.

దక్షిణాఫ్రికా: మార్క్మ్‌ (కెప్టెన్‌), హెన్రిక్స్‌, బ్రీట్జ్‌, స్టబ్స్‌/క్లాసెన్‌, మిల్లర్‌, ఫెరీరా, జాన్సెన్‌, కేశవ్‌, కోట్జీ, బర్గర్‌, షంసీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -