చెన్నై సూపర్ కింగ్స్కు రెండు వరుస విజయాలు వచ్చాయి.అలాగే రెండు ఎదురు దెబ్బలు కూడా తగిలాయి.మొదటి మ్యాచ్లో చివరి ఓవర్లో సిక్స్ కొట్టి జట్టుకి విజయాన్ని అదించిన కేదార్ జాదవ్ గాయంతో టోర్నీ నుండి తప్పుకున్నాడు.ఇప్పుడు మరో ఆటగాడు టోర్నీ నుండి తప్పుకున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆ ఆటగాడే సురేష్ రైనా.చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కీలక సభ్యుడు అయిన సురేష్ రైనా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు సురేశ్ రైనా తొడకు గాయమైంది.అతడు గాయం నుంచి కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనిని బట్టి చేస్తే రైనా కూడా టోర్నీ నుండి తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ముంబయి ఇండియన్స్తో జరిగిన తొలి మ్యాచ్ తర్వాత కేదార్ జాదవ్ మొత్తం ఈ టోర్నీకే దూరం కావడం ఇప్పడు రైనా దూరం అవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయాలపై ఈ ప్రభావం పడేలా ఉంది.ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయం సాధించిన చెన్నై హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. చెన్నై తన తరువాత మ్యాచ్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో తలపడనుంది.కావేరీ జల వివాదానికి సంబంధించి చెన్నైలో ఉద్థృతంగా ఆందోళనలు సాగుతున్న నేపథ్యంలో చెపాక్ స్టేడియంలో జరిగే మ్యాచ్లన్నింటినీ పుణెకు తరలించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.