Tuesday, May 7, 2024
- Advertisement -

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌…

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన పంజాబ్ జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. కేవలం మూడింట్లో గెలుపొందిన రాజస్థాన్ రాయల్స్ జట్టు చివరి స్థానంలో ఉంది.

వరుస ఓటముల నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో మూడు మార్పులు చేసింది. మహిపాల్, స్టువర్ట్ బిన్నీ, ఇస్ సోధీ జట్టులోకి వచ్చారు. పంజాబ్ జట్టు కూడా రెండు మార్పులు చేసింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో అక్షదీప్, అంకిత్ రాజ్‌పుత్ స్థానంలో మోహిత్ శర్మని జట్టులోకి తీసుకుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు: లోకేశ్ రాహుల్, క్రిస్‌గేల్, అక్షదీప్‌నాథ్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్, స్టాయినిస్, మనోజ్ తివారి, అశ్విన్, ఆండ్రూ టై, మోహిత్ శర్మ, ముజీబ్ ఉర్ రెహ్మాన్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, అజింక్య రహానె, సంజు శాంసన్, బెన్‌స్టోక్స్, స్టువర్ట్ బిన్నీ, మహిపాల్, ఆర్చర్, గౌతమ్, జయదేవ్ ఉనద్కత్, ఇస్ సోధీ, అనురీత్ సింగ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -