2019 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్కి కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి.. జట్టుని కనీసం ప్లేఆఫ్ చేర్చలేక పోయింది. స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నా ప్లే ఆఫ్ సెమీస్ రేస్కు చేరుకోలేక పోయింది. దీంతో కోహ్లీ కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తం అవుతున్న వేల రోహిత్ శర్మ మద్దతు పలికాడు.ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రపంచకప్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను అన్ని విధాల సహకారం అందిస్తానని రోహిత్ స్పష్టం చేశాడు.
గతంలో ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, ఇతర సీనియర్ ఆటగాళ్లు టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతనికి సలహాలు, సూచనలు చేసేశారు. కోహ్లీతో కలసి అనేక మ్యాచ్ల్లో ఆడానని కోహ్లీకి సాయపడటం నా కనీస బాధ్యత. మ్యాచ్లో ఏవైనా నిర్ణయాలు తీసుకునే సమయాల్లో కోహ్లీకి ఇబ్బందులు ఎదురైతే.. నా వంతుగా సాయం అందిస్తాను’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.గత రెండేళ్లుగా భారత సెలక్టర్లు ఏ సిరీస్కైనా.. కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ చేతికి టీమ్ పగ్గాలు అప్పగిస్తున్న విషయం తెలిసిందే.