- Advertisement -
ఐపీఎల్ ప్రారంభానికి ఒక్కరోజు ముందు సీఎస్కే యాజమాన్యం అదిరే సర్ప్రైజ్ ఇచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసింది. ధోని స్థానంలో రుతురాజ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసందనే చెప్పవచ్చు.
ధోని తన స్థానంలో కెప్టెన్గా రుతురాజ్ని నియమించిందని సీఎస్కే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదోసారి ట్రోఫీని అందించగా ఈ సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ రేసు నుండి తప్పుకున్నాడు. ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కానుంది.
ప్రస్తుతం ధోనీ వయసు 42 ఏళ్లు. గతంలో ఇండియన్ టీమ్ కు కూడా రుతురాజ్ కెప్టెన్ గా ఉన్నాడు. గతేడాది ఏషియన్ గేమ్స్ లో కెప్టెన్ గా గోల్డ్ మెడల్ సాధించాడు.ఇక ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కాగా రుతురాజ్ సారథ్యంలో టైటిల్ గెలుస్తుందా లేదా వేచిచూడాలి.