టీమిండియా మాజీకెప్టెన్ మహేంద్రసింగ్ధోనీ ఇప్పుడ కొత్త గెటప్లో కనిపించనున్నారు. వాణిజ్య ప్రకటనల రారాజుగా పేరొందిన ధోనీ క్రేజ్ కొంత తగ్గిందనే చెప్పాలి. దానికి కారణం ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీనే. అనూహ్యంగా వాణిజ్యప్రకటనల రంగంలోకి దూసుకొచ్చి ధోనీ అవకాశాలాను కొల్లగొట్టడంతో జోరు కాస్త తగ్గింది.
అయినా సరే ధోనీ క్రేజ్ను కొన్ని కంపెనీలు ఇప్పటికీ తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకుంటున్నాయి. సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని వచ్చిన ‘మిస్టర్ కూల్’ కొత్త గెటప్లో కనిపించి అభిమానులను అలరించాడు. శ్రీలంకలో రేపటి నుంచి జరగనున్న ముక్కోణపు సిరీస్ నుంచి అతనికి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు దొరికిన సమయాన్ని ఓ చాక్లెట్ యాడ్లో నటించేందుకు అతను ఉపయోగించుకున్నాడు.
ఇందులో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని ధోనీ ఇప్పుడు సరికొత్త గెటప్లో అతను దర్శనమిచ్చాడు. క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎలాగైతే పొడవాటి జుత్తుతో ఉండేవాడో అలాంటి గెటప్లోనే ఈ యాడ్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఈ గెటప్ బాగుందంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు.