- Advertisement -
రాహుల్ ద్రావిడ్. భారత క్రికెట్ కు ది వాల్. ఎన్నో మ్యాచ్ ల్లో భారత్ ను ఓటమి నుంచి కాపాడడమే కాదు.. గెలుపు బాట పట్టించిన క్రికెటర్. ఇప్పుడు అతని కొడుకు సమిత్ ద్రావిడ్ ఆ బాటలో నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.
అండర్ 14 క్రికెట్ లో ఏడాది నుంచి రాణిస్తున్న 11 ఏళ్ల సమిత్ ద్రావిడ్ ఈ సీజన్ లో సెంచనీ చేసి తానేమిటో రుచి చూపించాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రావిడ్ టైగర్ కప్ టోర్నీలో తన సత్తా చాటుతున్నాడు. ఫ్రాంక్ ఆంథోని పబ్లిక్ స్కూల్ తో జరిగిన మ్యాచ్ లో సమిత్ ద్రావిడ్ 125 పరుగులు సాధించాడు.
సహచర ఆటగాడు ప్రత్యూష్ తో కలిసి 213 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇందులో ప్రత్యూష్ 143 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో బియుసిసి జట్టు ఏకంగా 246 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.