Sunday, May 5, 2024
- Advertisement -

శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో అనుకోని అతిథులు..

- Advertisement -

వరల్డ్ కప్ లో ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్‌లోకి అనుకోని అతిథులు రావ‌డంతో కొంత‌సేపు ఆట‌కు అంత‌రాయం క‌లిగింది. అతిథితుల దెబ్బ‌కు ఆట‌గాల్లంద‌రూ ఎక్క‌డిక‌క్క‌డ నేల‌పైనె ప‌డుకుండిపోయారు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 48 ఓవర్‌లో అనుకోకుండా తేనెటీగ‌లు మైదానంలోకి చొర‌బ‌డ్డాయి. కాసేపటికి తేనెటీగలు మైదానాన్ని వీడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కొన్నాళ్లక్రితం కూడా ఈ రెండు జట్లు మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా తేనెటీగలు వచ్చాయి. ఇప్పుడు కూడా అవే జట్లు ఆడుతున్నప్పుడు రావడంతో వరల్డ్ కప్ నిర్వాహకులు ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.విచిత్రమేమిటంటే అప్పుడు కూడా శ్రీలంకనే బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -