Sunday, May 19, 2024
- Advertisement -

క‌ఠోర సాధ‌న చేస్తున్న టీమిండియా జ‌ట్టు….

- Advertisement -

సఫారీ గడ్డపై టీమిండియా కఠోర సాధన చేస్తోంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న సంగతి తెలిసిందే. ఇండోర్‌ స్టేడియంలో సాధన చేసిన ఆటగాళ్లు ఈ రోజు మైదానంలోనే చెమటోడ్చారు. ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఆధ్వర్యంలో ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సాధన చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది.
.
టీమిండియా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా గడ్డపై ఒక్క టెస్టు సిరీస్‌ కూడా కైవసం చేసుకోలేదు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న టీమిండియా సఫారీ గడ్డపై మాత్రం టెస్ట్ సిరీస్ గెల‌వాల‌న్న క‌ట్టుద‌ల‌తో ఉంది. అందుకే ప్రాక్టీస్ ముమ్మ‌రంగా చేస్తోంది టీమిండియా.

బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ విభాగాల్లో నిలకడగా రాణిస్తూ సొంతగడ్డపై వరుసగా టీమిండియా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల విజయాలు సాధించింది. ఇప్పుడు విదేశీ గడ్డపై ఎలా రాణిస్తుందన్న దానిపైనే అందరి చూపు. స‌ఫారీల‌తో మ్యాచ్ అంటె ఆషామాసీ కాదు. బైన్సీ పిచ్‌ల‌పై స‌ఫారీ బౌల‌ర్ల ఫేస్‌ను ఎదుర్కోవ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఈ పర్యటనలో భారత్‌ ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. జనవరి 5న కేప్‌టౌన్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. టీమిండియా ఆట‌గాల్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కింద చూడండి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -