Sunday, May 5, 2024
- Advertisement -

కోహ్లీపై ప్ర‌శంసలు కురిపించిన పాక్ క్రికెట‌ర్ దిగ్గ‌జం జావెద్‌ మియాందాదా…

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. నిన్న జరిగిన మూడో వన్డేలో 160 (నాటౌట్) పరుగులతో భారీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ ఇండియాను 3-0 ఆధిక్యతలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. చివరకు ఎప్పుడూ భారత్ పై విమర్శలు గుప్పించే పాక్ క్రికెట్ దిగ్గజం మియాందాద్ కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపించ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్స్ తనకు బాగా నచ్చుతాయని చెప్పిన మియాందాద్… బౌలర్ల బలాలు, బలహీనతలను కోహ్లీ అప్పటికప్పుడే అంచనా వేయగలడని కితాబిచ్చాడు. ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్ మెన్ కోహ్లీ అని చెప్పాడు. కోహ్లీ బ్యాటింగ్ విధానమే అతనికి పరుగులు ధారాళంగా రావడానికి కారణమని అన్నాడు. మియాందాద్ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో కోహ్లీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏ బ్యాట్స్‌మెన్‌కి అయినా ఓ టెక్నిక్‌ ఉంటుంది. అయినప్పటికీ ఒక్కోసారి ఫెయిలవుతూ ఉంటాడు. కానీ, కోహ్లీ విషయంలో అలా జరగదు. బౌలర్ల బలాలు, బలహీనతలను తెలుసుకుని వారిని సమర్థవంతంగా ఎదుర్కోంటున్నాడు. అతడో జీనియస్‌. అంతేకాదు ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మెన్‌’ అని ప్రశంసించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -