Monday, May 20, 2024
- Advertisement -

మ‌రో సెల్ఫీని పోస్ట్ చేసిన విరుష్క‌ జంట‌….అభిమానులు ఫిదా….

- Advertisement -

న్యూఇయ‌ర్ వేడుక‌ల‌తో పాటు త‌మ రెండో హనీమూన్ కోసం విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌లు ద‌క్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌కి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ వారు ప‌ర్య‌టిస్తున్న ప్ర‌దేశాల్లో సెల్ఫీలు దిగి అభిమానుల‌కోసం సోష‌ల్‌మీడియాలో పెడుతున్నారు విరుష్క జంట‌. తాజాగా మ‌రో కొత్త సెల్ఫీని విరాట్ కోహ్లీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు.

`కేప్‌టౌన్ చాలా అంద‌మైన ప్ర‌దేశం. నా ప్రేమ కూడా ఇక్క‌డ ఉండ‌టంతో కేప్‌టౌన్ ఇంకా అందంగా క‌నిపిస్తోంది` అని విరాట్ ట్వీట్ చేశారు. విరాట్ షేర్ చేసిన ఫొటోకే కాదు.. విరాట్ రాసిన పోస్ట్‌కి కూడా విరుష్క అభిమానులు ఫిదా అయిపోతున్నారు. వారు కేప్‌టౌన్‌కి వెళ్లిన నాటి నుంచి విరాట్ పోస్ట్ చేసిన రెండో సెల్ఫీ ఇది. వారి మొద‌టి హ‌నీమూన్ ఫిన్లాండ్‌లో మంచు కొండ‌ల మ‌ధ్య జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -