Sunday, April 28, 2024
- Advertisement -

ఛేజింగ్‌లో ఎక్క‌డైనా కోహ్లీ చిరుత‌పులీనే … పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్‌ అక్తర్

- Advertisement -

భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీని ముద్దుగా ఛేజ్‌ మాస్టర్‌ అని పిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎందుకంటే లక్ష్య ఛేదనలో కోహ్లీ ఆట తీరు అభిమానులకు కనువిందుగా ఉంటుంది. ముచ్చటైన డ్రైవ్‌లు, ఫ్లిక్స్‌, కట్‌ షాట్లతో మైదానం అన్నివైపులా కళ్లు చెదిరే షాట్లతో అలరిస్తాడు.

తాజాగా డర్బన్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ మరో సారి తనదైన షాట్లతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేశాడు. ఈ వన్డేలో 112 పరుగుల కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో కోహ్లీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కోహ్లి సూపర్ ఛేజింగ్ సెంచరీకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్‌ అక్తర్ ఫిదా అయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఛేజింగ్‌లో సెంచరీ చేసిన కోహ్లిని అక్తర్ ప్రశంసల్లో ముంచెత్తాడు.

సాధారణంగా భారత క్రికెటర్లు అంటేనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసే అక్తర్ సైతం విరాట్ బ్యాటింగ్‌ను కొనియాడాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా కోహ్లిని చిరుతపులితో పోల్చాడు. ‘ఛేజింగ్లో కోహ్లి మరో సూపర్ ఇన్నింగ్ ఆడాడు. ఛేజింగ్ అంటే చాలు అతడు చిరుతపులిలా మారిపోతాడు. ఛేజింగ్ లో అతడు కోహ్లినా.. లేక చిరుతపులా అని డౌట్ వస్తుంది. యువ క్రికెటర్లు కోహ్లిని ఆదర్శంగా తీసుకుని ఎంతో నేర్చుకోవాలని’ ట్వీట్ చేశాడు ‘రావల్ఫిండి ఎక్స్‌ప్రెస్’ అక్తర్.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఓపెనర్లు త్వరగా ఓటైనా అజింక్య రహానే(79)తో కలిసి కెప్టెన్ కోహ్లి మూడో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఛేజింగ్‌లో తాను ఎంతటి ప్రమాదకారో కోహ్లి తన శతక ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -