ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న బంగ్లాదేశ్ ఒక పక్క….వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో పక్క. అసాధారన విజయాలను నమోదు చేస్తున్న బంగ్లా ఇండియాతో తలపడనుంది.సోమవారం అప్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆల్రౌండర్ ప్రదర్శనతో 62 పరుగుల తేడాతో విజయం సాధించడంతో టాప్ 5 లోకి దూసుకొచ్చింది.
తమ తదుపరి మ్యాచ్లను మాజీ చాంపియన్స్ భారత్, పాకిస్తాన్లతో ఆడనుంది. ప్రస్తుతం 7 మ్యాచ్లు ఆడిన బంగ్లా 3 గెలిచి 7 పాయింట్లతో 5 స్థానంలో నిలిచింది. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ల ఆట అందరిని ఆకట్టుకుంటోంది. జూలై 2న భారత్తో బంగ్లాతలపడనుంది. దాదాపు వారంకు పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించింది.
భారత్తో జరిగే మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన జట్టు భారత్. వారిని ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. భారత్లో దిగ్గజశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించే సత్తా వారికుంది. మేం మా సాయశక్తుల పోరాడుతాం. భారత్ను ఓడించే సత్తా మాకు ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలమైన భారత్ జట్టును ఓడిస్తుందా లేక చేతులెత్తేస్తుందా అన్నది వేచి చూడాల్సింది.