ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలేని పరిస్థితి ఏర్పడింది. అయితే టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారని.. ఇంటిలిజెన్స్ వర్గాలు ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే రావెల వైసీపీలో చేరేకంటే ముందు.. టీడీపీ అధిష్టానం ఆయన మీద వేటు వేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టిక్కెట్ కొట్టేసి.. మంత్రి అయ్యారు రావెల. మంత్రి అయినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించకపోవడం.. నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను లెక్కచేయకపోవడం.. ఇలాంటి ఎన్నో అంశాల్లో ఆయనకు నెగిటివ్ మార్కులు పడ్డాయి.
{loadmodule mod_custom,GA2}
ఇక ఆయన ఇద్దరు కుమారులు మహిళల విషయంలో అభ్యంతరకరంగా వ్యవహరించడం కూడా ఆయనకు పెద్ద మైనస్ అయ్యింది. రావెల తీరుపై అటు నియోజకవర్గంలోను.. ఇటు పార్టీలోను, స్టేట్ వైడ్గా జనాల్లోను తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఆయన్ను మంత్రి పదవి నుంచి దింపకపోతే.. ఆ ఎఫెక్ట్ గట్టిగా పడే చాన్స్ ఉందని భావించిన చంద్రబాబు.. ప్రక్షాళనలో ఆయనకు ఊస్టింగ్ ఇచ్చారు. మంత్రి పదవి ఊడిన తర్వాత రావెల తన నియోజకవర్గంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక వచ్చే ఎన్నికల్లో రావెలకు టీడీపీ టిక్కెట్ కూడా దక్కడం చాలా కష్టమేనని రావెలకు ముందే సిగ్నల్స్ అందడంతో ఆయన వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసేకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వైసీపీ నాయకులకు.. కార్యకర్తలకు రావెల పనులు చేసి పెడుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న.. చంద్రబాబు రావెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రెడీగా ఉన్నారట. ఏది ఏమైనా రావెల వైసీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినాయకత్వంతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related