ఏపీకి ప్రత్యేక హోదా కోసం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పోరడుతునే ఉన్నారు. ప్రజలతో పాటు జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ఈ పోరటానికి ముందు అడుగు వేసి ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలని పోరటాం చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా.. వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా కోసం పోరటం చేస్తున్నారు. ఇటివలే విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా పోరటానికి పవన్, జగన్ తమ పూర్తి మద్దతుని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రభుత్వంను ఎంత ప్రశ్నించినా ఫలితం లేకుండా పోయింది.
దాంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ కలవబోతున్నారట. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన సభల ద్వారా… ప్రత్యేక హోదా కావాలని కేంద్రంపై పోరటం చేశారు. అలాగే ప్రత్యేక హోదా వచ్చేవరకు వెనక్కి తగ్గిదే లేదని కూడా సృష్టం చేశాడు. యువతను కూడా ప్రత్యేక హోదా సాధించే పోరటం చేయాలని కోరాడు. అలాగే వైఎస్ జగన్ కూడా చంద్రబాబు పాలనను తప్పుబట్టారు. ఆయన చేస్తుంది అసలు ప్రజలకు ఏ మాత్రం ఊపయోగ పడటం లేదని.. బాబు పాలన ఫేయిల్ అయ్యిందని.. చంద్రబాబు చేస్తున్న ద్రోహం ప్రజలు పసిగట్టారు అని వైఎస్ చాలా సభలో చెప్పారు.
ఇక పవన్, జగన్ కలిసి రాష్ట్రంలో కొత్త ట్రెండ్ తీసుకరానున్నారని కొందరు నెతలు అంటున్నారు. ప్రభుత్వ తీరు పై ఇప్పటికే ప్రజల్లో నమ్మకం పోయింది. గత ఎన్నికలో పవన్ బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కలిసి రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని రాజకీయ పండితులు అంటున్నారు. అందుకే ఈ నెల 28న ప్రత్యేక హోదా కోసం పవన్, జగన్ ఫస్ట్ మీటింగ్ ఏర్పటు చేసుకున్నారట. ఈ మీటింగ్ లో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడుకుంటారని తెలుస్తోంది.