ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా.. ఎవరు పోరాడినా మద్దతిస్తామని.. అలానే కలిసి పనిచేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబు చెప్పినట్లు వినే పరిస్థితిలో ఉన్నారని.. ఆ విధానంమారాలని వైఎస్ జగన్ సూచించారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో మార్చినాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయపార్టీగా అవతరిస్తుందని.. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. బడ్జెట్ లెక్కలపై మాట్లాడిన జగన్.. ఇదంతా అంకెల గారడీ తప్పా మరేమీ లేదన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కలపై జగన్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి చెబుతున్న లెక్కల ప్రకారం.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిందని.. ఇంకా టార్గెట్ 2050 ఎందుకు? అని జగన్ ప్రశ్నించారు.
{youtube}v=TcOQGJQ_0iw{/youtube}