మహారాష్ట్ర తో కీలక ఒప్పందాలు చేసుకుని తిరిగి వచ్చిన కెసిఆర్ కి ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. గొప్ప ఊరేగింపుతో పాటుగా కెసిఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఒప్పందం విషయం ఆయనకీ నెగెటివ్ కామెంట్ లు కూడా ఎక్కువ అయిపోయాయి . మహారాష్ట్రలో కుదిరిన ఒప్పందం విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఒప్పందం తెలంగాణ ప్రజలపాలిట శాపంగా మారుతుంది, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెట్టేశారనీ, తమ్మిడి హెట్టి ప్రాజెక్టు గతంలో 152 అడుగులకు ఓకే అయిదే, దాన్ని తగ్గించుకుని వచ్చి సంబరాలు చేసుకోవడం ఏంటని విమర్శించారు. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మిడి హెట్టి ప్రాజెక్టు ఎత్తు 152 అడుగులుగా గతంలో ఒప్పందం కుదిరిందని నిరూపిస్తే నేరుగా రాజభవన్కు వెళ్లి ముఖ్యమంత్రివికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, ఆ ఆధారాలను చూపించే దమ్ము మీకుందా, ఉంటే వాటిని తీసుకుని బేగంపేటకు రండి… అంటూ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి సవాలు విసిరారు. ఆ ఒప్పంద పత్రాలు పట్టుకుని వస్తే.. తాను వెంటనే రాజ్భవన్కు వెళ్తాననీ, రాజనామా గవర్నర్కు సమర్పిస్తానని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, టీడీపీ, భాజపా నేతలు అడ్డుపడ్డా అభివృద్ధి పనులు ఆగే ప్రసక్తే లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.