నంద్యాల ఉపన్నిక సీఎం చంద్రబాబునాయుడికి తలనొప్పిగా మారంది.టికెట్టు విషయంలో టీడీపీలోనే పోటీ తీవ్రస్తాయికి చేరింది.ఇప్పటికే టికెట్టు విషయంలో ఎవరిపైరవీలు వారు చేసుకుంటున్నారు.టికెట్టు కోసం మాజీ మంత్రి నంద్యాల టిడిపి ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్టు వస్తాదన్న నమ్మకంతో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి ఆయన రంగం సిద్దం చేసుకొంటున్నారు.ఒకవేల టికెట్టు రాకపోతో పార్టీమారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.దీనికి సంబంధించి తన అనుచరులతో సమావేశమయ్యి భవిష్యత్తు కార్యాచరనపై చర్చించినట్లు సమాచారం.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.భూమాకూతురు ఆళ్లడ్డఎమ్ఎల్ఏ భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో స్తానం కల్పించారు.నంద్యాల నియేజకవర్గంలో భూమాకు ఉన్న అభిమానం,పాలోయింగ్ సెంటీ మెంట్ రెండూ కలసి వస్తాయనీ టీడీపీ ధీమాతో ఉంది.అయితే చిక్కంతా టికెట్టు ఎవరికి కేటాయించాలనేదే ఇప్పుడు బాబుకు తలనొప్పిగా మారింది.. భూమా కుటుంబానికి చెందిన వారు బరిలోకి దింపాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. భూమాకుటుంబానికి టికెట్టు కేటాయించకుండా ఉండేందుక అఖిల ప్రియకు మంత్రి వర్గంలో స్తానం కల్పించారనే ప్రచారం జరుగుతోంది.యితే ఈ ఎన్నికల్లో తాను బరిలోకి దిగాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం.
ఈ మేరకు తన అనుచరులతో శిల్పా సమావేశమయ్యారు.పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోతే పార్టీని వీడే యోచనలో మోహన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అదే సమయంలో పార్టీ టిక్కెట్టు దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని కూడ యోచిస్తున్నారు శిల్పా మోహన్ రెడ్డి.అయితే ఇటీవలనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా సోదరుడు చక్రపాణి రెడ్డి విజయం సాధించారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా పోటీచేయాలనే ఆలోచనను సోదరుడు చక్రపాణి రెడ్డి వ్యతిరేకించారని సమాచారం. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో టిక్కెట్టు దక్కకపోతే పార్టీ మారితే ఎలా ఉంటుంది. లేదా స్వతంత్రంగా పోటీచేస్తే ఎలా ఉంటుందనే విషయమై శిల్పా మోహన్ రెడ్డి అనుచరులతో చర్చలు జరిపినట్లు సమాచారం. టీడీపీకీ ప్రతిస్టాత్మకంగా మరిన నంద్యాల ఉపెన్నిక టికెట్టువిషయంలో అసమ్మతిని అధిగమించి టికెట్టు ఎవరికి కేటాయిస్తారో అనేది చర్చనీయాంశంగా మారింది.