వేణుస్వామి.. తన పంచాంగంతో రాజకీయ నేతలకు దడ పుట్టిస్తున్నాడు. మరోసారి సంచలన పంచాంగం చెప్పారు. ఇటీవల ఉగాది పర్వదినాన కేసీఆర్, చంద్రబాబు, జగన్, నారా లోకేష్ ల జాతకాలను చెప్పి, వార్తల్లో నిలిచిన వేణుస్వామి ఈ సారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ జాతకం చూసినట్టైతే.. ఆయనకు తిరుగులేదని.. ఇప్పటికే సినిమాల్లో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటున్న ఎన్టీఆర్ రాబోయేరోజులు చాలా వరకు కలిసి వస్తాయన్నారు.
ముఖ్యంగా సినిమా పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ ది చాలా గొప్ప జాతకమని వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించేంత దమ్ము, ధైర్యం అతడికే ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ కు ఇప్పటివరకు ఉన్న శని పోయిందని.. మరో 10 సంవత్సరాల వరకు ఆయనకు ఢోకా లేదన్నారు. స్వశక్తితో పైకి వచ్చే క్యారెక్టర్ కనుక ఆయనకు రాజకీయపరంగా చాలా అనుకూలత ఉండన్నారు.
ఆపదకాలంలో ఆదుకునే వ్యక్తి కనుక ఆయన వేసే అడుగులు చాలా గొప్పగా ఉంటాయన్న వేణుస్వామి..2020 తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టడం ఖాయం అని సెన్సేషనల్ పంచాంగం చెప్పారు. పేదల పార్టీగా సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ముందుండి నడిపించే ఏకైక నాయకుడు ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. మరి వేణుస్వామి చెప్పిన ఈ సంచలన పంచాగంపై చంద్రబాబు వర్గానికి వణుకు పుట్టడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.