దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకీ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలల్లో చిన్న చిన్న కారనాలవల్లే రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా చనిపోతున్నారి అధికారులు చెప్తున్నారు.
ప్రధానంగా మరణాలు కార్లల్లో వెల్లేవారు సీటు బెల్టు పెట్టుకోక పోవడం…ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోక పోవడంవల్లే మరణిస్తున్నారనీ గుణాంకాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా హెల్మెట్లను తప్పని సరిచేసిన విషయం తెలిసిందే.
{loadmodule mod_custom,Side Ad 1}
ప్రణా రక్షణ కోసం తలకు పెట్టుకున్న హెల్మెట్ ఒయువకుడి ప్రాణం తీసింది. అదేంటి హెట్మెట్ రక్షణ కోసం కదా పెట్టుకొనేది ఇది ఎలా జరిగింది అనుకుంటున్నారా ఇది నిజం. మరణం ఆసన్నమయినపుడు ఎన్నిరక్షణ కవాచాలు పెట్టుకున్న దాన్ని అపలేరనేది సత్యం. హెల్మెటే అతని మరణం పాలిట శాపం అయ్యింది.
చిత్తూరు జిల్లా పలమనేరుకు అయిదు కిలోమీటర్ల దూరంలోని ఆంజనేయ ఆలయం వద్ద పడిన పిడుగు తాకిడికి చెట్టు కింద నిలుచున్న పృథ్వీరాజ్ అనే వ్యక్తి మరణించారు.పృథ్వీరాజ్ స్థానికంగా వాద్యబృందం (ఆర్కెస్ట్రా)లో పనిచేస్తున్నారు. కచేరి కోసం శుక్రవారం రాత్రి పలమనేరు నుంచి చిత్తూరుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో రహదారి పక్కన ద్విచక్రవాహనం నిలిపి తలపై శిరస్త్రాణంతో చెట్టు కింద నిలుచున్నారు.
{loadmodule mod_custom,Side Ad 2}
కాని విధి వక్రీకరించింది ..అదే సయంలో దూరంగా పిడుగు పడింది.విద్యుత్తు తరంగాలు ఆయన చెవికి దగ్గరగా తాకి శిరస్త్రాణం నుంచి లోపలికి చేరడంతో చెవుల్లో నుంచి రక్తం కారి మరణించి ఉంటారని పోలీసులు, వైద్యులు చెబుతున్నారు. మృతుడి ఛాతిపై వెంట్రుకలు కాలిన గుర్తులున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.చేశారుగా రక్షణకోసం అతను ఉపయేగించిన హెల్మెట్ ప్రాణంతీసింది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}yfGqhVqLpfo{/youtube}