దేశంలో ముందస్తు ఎన్నికలను నిర్వహించాలని కేంద్రం ఆలోచ చేస్తుంటే …రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రధానంగా మాస్ ఇమేజ్తోపాటు ..సినీ గ్లామర్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.గతంతో ఎన్టిరామారావు టీడీపీని స్థాపించి ఎలా ప్రభంజనం సృష్టించారో చెప్పాల్సిన పనిలేదు.రాను రాను ఎన్నికలు ప్రధాన ఆకర్శన సినీగ్లామర్ ఉండబోంతోంది.
గెలుపులోకూడా ఈగ్లామర్ పనిచేస్తుంది. ఇప్పటికే టీడీపీకి సినీ గ్లామర్చూసుకుంటే ప్రస్తుతం ఆపార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినీ గ్లామర్ గా ఉన్నారు.ఇక జనసేన పార్టీ గురించి చెప్పాలంటే ఆపార్టీ అధినేతే ఒక ఆకర్శన.ఇప్పటికే ఆలీ కూడా జనసేన పార్టీలో చేరారని వార్తులు వస్తున్నాయి. టీడీపీకి ఉన్నంత సినీ గ్లామర్ ఏపార్టీకిలేదు.టీడీపీ వ్యవస్తాపకుడు,దివంగత మాజీ సీఎం ఎన్ టీ రామారావు సినిమానుంచి రావడంతో ఎక్కువగా సినీటులు ఆపార్టీవైపే మొగ్గు చూపారు.ఎన్నోపదవులు అనుభవించారు.వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేదుకు తనవైన శైలిలో ముందుకు వెల్తుంటే …మరో వైపు వైసీపీకూడా 2018 ఎన్నికలను ఎదుర్కొవడానికి తన వైన శైలిలో ప్రణాలికలు రూపొందించుకుంటున్నారు.
దీంతో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డతున్నారు. ఇతర పార్టీలకు చెందిన సీనియర్లతోపాటు వారి వారసులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని టాక్. ఈక్రమంలో సినీ గ్లామర్ వ్యక్తులమీద కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.నిన్నటి తరం హీరో సుమన్, రాజశేఖర్-జీవితతోపాటు… రాశినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీ వలే సుమన్ రాజకీయాలల్లోకి వస్తానని సిద్ధాంత పరమైన ప్రజాసమస్యలపై పోరాడు పార్టీలో చేరుతానని ప్రకటించారు.గత మూడు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వ అవినీతిపై పోరాడుగున్న వైసీపీ వైపు సుమన్ మొగ్గు చూపె అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక రాశి, జీవిత-రాజశేఖర్లకు పార్టీ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం. జీవిత-రాజశేఖర్ గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబంతో ఉన్న అనుబంధం కారనంగా వాల్లు జగన్వైపు మొగ్గుచపె అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి సినీ గ్లామర్ జగన్కు ఎంతవరకు ఉపయేగపడుతుందో వేచి చూడాలి.
Related