ఏపీ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. జగన్ సీఎం కాకముందుకు ఒక లెక్క.. జగన్ సీఎం అయ్యాక మరో లెక్కగా రాజకీయాలు మారిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. కనీసం ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం డిమాండ్ చేసే అవకాశం కూడా ప్రతిపక్షాలకు ఇవ్వడం లేదు.
నాడు విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన సమయంలో… ప్రతిపక్షాలు నిద్రలేచే లోపు… జగన్ విశాఖలో వాలిపోయారు. బాధితులకు కోటీ రూపాయల పరిహారం అందించారు. వారంలోపే అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షాలు ఏం చేయాలేక.. ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదే క్రమంలో తాజాగా… విజయవాడ స్వర్ణ ప్యాలస్ లో జరిగిన అగ్నిప్రమాధం విషయంలో కూడా ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది.. 50లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది.
ఆ ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు చేసింది.. బాధితులకు అండగా నిలిచింది. ఈ విషయాలపై ప్రతిపక్షాలన్నీ దిగ్భ్రాంతిని ప్రకటించాయి తప్ప.. కనీసం ప్రమాధ స్థలిని పరిశీలించిన పాపాన పోలేదు! సో ఇదంతా పరిశీలీస్తే.. ప్రభాస్ సినిమాలోని ఓ డైలాగ్ గుర్తొకు వస్తోంది. ” గడిచిన ఐదేళ్లు ఒక లెక్క.. 2019 ఎన్నికల రిజల్ట్ తర్వాత ఒక లేక్క. వైఎస్ రాజశేఖరెడ్డి కొడుకొచ్చాడని వాళ్లకు చెప్పు..” ఈ సందర్భంగా అంటున్నారు జగన్ ఫ్యాన్స్.
చంద్రబాబుకు జలక్ ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు..!
జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్ బెల్.. !