గతంలో హీరోయిన్స్ గా చేసి ఇప్పుడు అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటిస్తున్న యాక్ట్రెస్.. ఇప్పుడు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చూద్దాం.
రమ్యకృష్ణ : మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునల పక్కన హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రమ్యకృష్ణ. ఇప్పుడు కుర్ర హీరోలకు అమ్మ గా అత్తగా నటిస్తోంది. ఈమె రోజుకు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ పొజిషన్లో ఉన్నారు.
జయసుధ : సహజ నటిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది జయసుధ. అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి, బొమ్మరిల్లు సినిమాల్లో హీరో తల్లిగా అద్భుత నటనను ప్రదర్శించారు. ఈమె సినిమాకు రూ.20 లక్షలు, లేదా రోజుకు రూ. లక్ష చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
నదియా : పాతికేళ్ల క్రితం హీరోయిన్ గా చేసింది నదియా. సెకండ్ ఇన్నింగ్స్ తెలుగు పరిశ్రమలో దూసుకు పోతోంది. మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా ఆకట్టుకున్నారు. అత్తారింటికి దారేదిలో టైటిల్ రోల్ పోషించారు. ఈమె రోజుకు రూ. 2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
రేవతి : సీనియర్ నటి రేవతి దక్షిణాది భాషలతో పాటు, హిందీలోనూ నటించారు. తెలుగులో లోఫర్ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి తల్లిగా నటించారు. బ్రహ్మోత్సవం చిత్రంలో సూపర్ స్టార్ అమ్మగా మెప్పించారు. రేవతి సినిమాకు రూ. 15 – 20 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.
మధుబాల : రోజా సినిమాతో అందరికి పరిచయమైన హీరోయిన్ మధుబాల. తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది. ఈమె ప్రస్తుతం తల్లి పాత్రల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె రోజుకు రూ. 75 వేలు చొప్పున తీసుకుంటోంది.
ప్రగతి : గంగోత్రి సినిమా నుండి ప్రగతి తల్లి పాత్రలు చేస్తోంది. ఈమె రోజుకు రూ.40 వేలు అందుకుంటున్నారు. గతంలో ఈమె ఆరు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
2003 లో విడుదలైన గంగోత్రి సినిమా నుంచి మొన్న హిట్ అందుకున్న నేను శైలజ సినిమా వరకు దాదాపు 80 సినిమాల్లో హీరో/హీరోయిన్ అమ్మగా కనిపించిన నటి ప్రగతి. ఈమె రోజుకు రూ.40 వేలు అందుకుంటున్నారు. గతంలో ఈమె ఆరు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
పవిత్ర లోకేష్ : సన్నాఫ్ సత్యమూర్తి, రేసు గుర్రం సినిమాల్లో తల్లిగా నటించిన పవిత్ర లోకేష్ రోజుకు రూ.50-60 వేలు తీసుకుంటున్నారు.
మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?
మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!