Thursday, May 23, 2024
- Advertisement -

అసత్య ప్రచారాలు చేయొద్దు.. సోషల్ మీడియాకు సీపీ అంజనీ కుమార్ వార్నింగ్!

- Advertisement -

గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు అమీ తుమీ అంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొంత మంది సోషల్ మీడియాలో ప్రజలకు లేని పోని అపోహలు కల్పిస్తున్నారని ప్రజల్లో అశాంతిని రేకెత్తించడం వంటివి చేస్తున్నారని హైద్రాబాద్ లో ఎదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు హైద్రాబాద్ సీపీ అంజని కుమార్.

మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు  అన్నారు. నగర ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలు ఏమాత్రం నమ్మవద్దని.. లా అండ్ అర్డర్ చాలా సీరియస్ గా మెయింటేన్ చేస్తున్నామని అన్నారు.

లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేసే వాళ్లపై పీడీ యాక్ట్ లు పెడతామని సీపీ అంజనీ హెచ్చరికలు చేసారు. ఒకవేళ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం వారు భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -